సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో 50 గంటలు మద్యం బంద్..
- September 26, 2015
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలోని అన్ని మద్యం షాపులు మూసిఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలవరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించినట్లు సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటు ఇతర జిల్లాల్లోనూ ఆయా ఎస్సీలు మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







