వినియోగదారుల కోసం ఈద్ కలెక్షన్స్
- September 26, 2015
ప్రత్యేక ఆఫర్స్తో, ప్రమోషనల్ ఈవెంట్స్తో వినియోగదారుల్ని ఈద్ సందర్భంగా ఆకట్టుకునేందుకు వివిధ సంస్థలు పోటీ పడ్డాయి. మార్కెట్లు వినియోగదారుల సందడితో కొత్త కళను సంతరించుకున్నాయి. హైపర్ మార్కెట్స్, ఉపకరణ దుకాణాలు, నగలు, లగ్జరీ ఆటో మొబైల్స్ దుకాణాలు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్స్తో సిద్ధమయ్యాయి. ఆటోమొబైల్ రంగంలో ఏడాది పాటు ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని ఉచితంగా అందించడం, సంవత్సరం పాటు ఉచిత సర్వీసింగ్ సౌకర్యం కల్పించడం వంటి ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. ఓ ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్ అయితే రెండేళ్ళపాటు ఉచిత సర్వీస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే సగానికి పైగా అమ్మకాలు జరిగిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 318 ఐ బిఎండబ్ల్యు 2016 మోడల్ కేవలం 99,990 ఖతారీ రియాల్స్కే ఆఫర్లో లభ్యమవుతోంది. మామూలుగా అయితే దీని విలువ 1,35,00 ఖతారీ రియాల్స్. దాంతోపాటుగా ఉచితంగా 55 అడుగుల కర్వ్డ్ ఎలజీ ఓఎల్ఈడీ టీవీ కూడా లభించనుంది. బర్వా సిటీలోని లులు హైపర్ మార్కెట్, లక్కీ డ్రా కూపన్లను ప్రకటించింది. ఈ కూపన్లలో విజేతలకు ఇ 200 క్లాసిక్ బెంజ్ కార్ బహుమతిగా లభించనుంది. హోటళ్ళు, ఇన్ హౌస్ రెస్టిరెంట్లు కూడా ఓపెన్ బఫెట్ తదితర ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్ ఫోన్లు, హెచ్డి టీవీలు, ఓవెన్స్, మరియు వంట పరికరాలు తక్కువ ధరలకే హైపర్ మార్కెట్లలో లభ్యమవుతున్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







