కామెల్ కాన్వాయ్లో ఉల్లాసంగా ఉత్సాహంగా
- March 20, 2017
తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో 9 కిలోమీటర్ల మేర కామెల్ కాన్వాయ్లో 400 మంది పాల్గొన్నారు. నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలోని ఖబౌరాలో గల వాడి అల్ హవ్స్నా నుంచి ఈ ట్రిప్ ప్రారంభమయ్యింది. రిటైర్డ్ మేజర్జనరల్ సైద్ బిన్ నాజర్ అల్ సల్మి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్ పరిధిలోని పలు గవర్నరేట్స్కి చెందిన పలువురు ఈ కాన్వాయ్లో పాల్గొన్నారని నాజర్ అల్ హోస్ని అనే పార్టిసిపెంట్ చెప్పారు. వీరిలో యూకే మరియు యుఎస్ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిథులు కూడా ఉన్నారు. 9 కిలోమీటర్ల ఈ యాత్రను పూర్తి చేయడానికి 3 గంటల సమయం పట్టింది. అత్యంత క్లిష్టతరమైన ఈ రవాణా మార్గంలో తమ పూర్వీకులు పడ్డ కష్టం గురించి యాత్రలో పాల్గొన్నవారంతా తెలుసుకున్నారు. డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయనీ, ఈ టూర్ ప్రతి యేడాదీ కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని హోస్నీ చెప్పారు. కార్లో ముందుగా గమ్యాన్ని చేరుకున్న ఇద్దరు ఒమనీయుల్ని మేజర్ జనరల్ సల్మి సత్కరించారు.
తాజా వార్తలు
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!







