రోజర్ ఫెదరర్ ఆరోస్థానానికి
- March 21, 2017
ఏటీపీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. 10వ స్థానంలో ఉన్న ఫెదరర్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. ఫెదరర్ తాజాగా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా క్వార్టర్స్లో ఫెదరర్.. తనకన్నా మెరుగైన క్రీడాకారుడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ను ఓడించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్లో ఫెదరర్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా... నాదల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఆండీ ముర్రే, నొవాక్ జకోవిచ్, వావ్రింకా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
సెరెనాను వెనక్కి నెట్టిన కెర్బర్
జర్మనీ క్రీడాకారిణి కెర్బర్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ వెల్స్ మాస్టర్ టోర్నమెంట్లో నాలుగో రౌండ్లో కెర్బర్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇండియన్ వెల్స్ టోర్నీలో సెరెనా పాల్గొనలేదు. దీంతో కెర్బర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







