రోజర్ ఫెదరర్ ఆరోస్థానానికి
- March 21, 2017
ఏటీపీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. 10వ స్థానంలో ఉన్న ఫెదరర్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. ఫెదరర్ తాజాగా ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా క్వార్టర్స్లో ఫెదరర్.. తనకన్నా మెరుగైన క్రీడాకారుడు, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ను ఓడించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్లో ఫెదరర్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా... నాదల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఆండీ ముర్రే, నొవాక్ జకోవిచ్, వావ్రింకా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
సెరెనాను వెనక్కి నెట్టిన కెర్బర్
జర్మనీ క్రీడాకారిణి కెర్బర్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ వెల్స్ మాస్టర్ టోర్నమెంట్లో నాలుగో రౌండ్లో కెర్బర్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇండియన్ వెల్స్ టోర్నీలో సెరెనా పాల్గొనలేదు. దీంతో కెర్బర్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









