అబుదాబి లోని మృతులకు డిఎన్ఏ పరీక్ష
- March 21, 2017
అబుదాబిలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు తెలంగాణ వాసుల్లో ఒకరిని నిర్మల్కు చెందిన పిట్టల రవీందర్గా ఇప్పటికే గుర్తించగా, మరో ఐదుగురిని అబుదాబి ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున వారిని అబుదాబి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కెటిఆర్ జిఎడి అధికారులను ఆదేశించారు. అవసరమైన పాస్పోర్టు, వీసాలను సమకూర్చాలని నిర్మల్, నిజామాబాద్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు, వారికి సహాయకులుగా మరో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు అబుదాబి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఈ నెల 21న అబుదాబికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిపారు.
--సాయికృష్ణ యాదవ్
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







