అబుదాబి లోని మృతులకు డిఎన్ఏ పరీక్ష
- March 21, 2017
అబుదాబిలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు తెలంగాణ వాసుల్లో ఒకరిని నిర్మల్కు చెందిన పిట్టల రవీందర్గా ఇప్పటికే గుర్తించగా, మరో ఐదుగురిని అబుదాబి ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున వారిని అబుదాబి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కెటిఆర్ జిఎడి అధికారులను ఆదేశించారు. అవసరమైన పాస్పోర్టు, వీసాలను సమకూర్చాలని నిర్మల్, నిజామాబాద్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు, వారికి సహాయకులుగా మరో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు అబుదాబి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఈ నెల 21న అబుదాబికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిపారు.
--సాయికృష్ణ యాదవ్
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









