అబుదాబి లోని మృతులకు డిఎన్‌ఏ పరీక్ష

- March 21, 2017 , by Maagulf
అబుదాబి లోని మృతులకు డిఎన్‌ఏ పరీక్ష

అబుదాబిలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు తెలంగాణ వాసుల్లో ఒకరిని నిర్మల్‌కు చెందిన పిట్టల రవీందర్‌గా ఇప్పటికే గుర్తించగా, మరో ఐదుగురిని అబుదాబి ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మిగిలిన నాలుగు మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువులకు డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున వారిని అబుదాబి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కెటిఆర్ జిఎడి అధికారులను ఆదేశించారు. అవసరమైన పాస్‌పోర్టు, వీసాలను సమకూర్చాలని నిర్మల్, నిజామాబాద్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు, వారికి సహాయకులుగా మరో ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు అబుదాబి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ నెల 21న అబుదాబికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిపారు.

--సాయికృష్ణ యాదవ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com