నకిలీ నోట్లు: ఖతార్లో ఇద్దరి అరెస్ట్
- March 21, 2017
నకిలీ నోట్లని డాలర్స్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోహా క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తి, అలాగే బ్రిటన్కి చెందిన మరో వ్యక్తి నకిలీ నోట్లను చెలామణీ చేస్తూ దొరికిపోయారు. 500 ఖతారీ రియాల్స్ బ్యాంక్ నోట్స్ని వీరు నకిలీగా మార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అయితే తాము ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదనీ తమ వద్ద ఉన్న నోట్లను డాలర్లలోకి మార్చాలనుకున్నామని వారంటున్నారు. 16,500 ఖతారీ రియాల్స్ విలువైన 500 ఖతారీ రియాల్స్ నోట్లను వీరు ఎక్స్చేంజ్ చేయబోయారు. అయితే విచారణలో అవి నకిలీ నోట్లు అని తేలింది. నకిలీ తయారీ కోసం వీరు వినియోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









