హయా వాటర్ - రక్తదాన శిబిరం
- March 21, 2017
సామాజిక బాధ్యతగా హయా వాటర్ సంస్థ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో నిర్వహించింది. బైత్ హయా ప్రాంతంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ హనన్ యూసుఫ్ బలుషి మాట్లాడుతూ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి రక్తదాన శిబిరాల్ని తమ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారాయన. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఇదొక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు హనన్. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి, అత్యవసర ఆపరేషన్లు అవసరమైనవారికి రక్తం ఎంతో అవసరమని అలాంటివారికోసం రక్తదానం చేయాలన్న అవగాహన ప్రతి ఒక్కరిలోనూ పెరగాలని హనన్ చెప్పారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









