హయా వాటర్ - రక్తదాన శిబిరం
- March 21, 2017
సామాజిక బాధ్యతగా హయా వాటర్ సంస్థ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో నిర్వహించింది. బైత్ హయా ప్రాంతంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ హనన్ యూసుఫ్ బలుషి మాట్లాడుతూ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి రక్తదాన శిబిరాల్ని తమ సంస్థ నిర్వహిస్తోందని చెప్పారాయన. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందని ఇదొక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ రక్తదానం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు హనన్. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి, అత్యవసర ఆపరేషన్లు అవసరమైనవారికి రక్తం ఎంతో అవసరమని అలాంటివారికోసం రక్తదానం చేయాలన్న అవగాహన ప్రతి ఒక్కరిలోనూ పెరగాలని హనన్ చెప్పారు.
తాజా వార్తలు
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA









