అనుచిత వ్యాఖ్యలు చేసిన అబ్దుల్ బాసిత్
- March 23, 2017
భారత్లో పాకిస్థాన్ హై కమిషనర్గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ రాగం పాడారు. కాశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆయన మద్దతు పలికారు. కశ్మీర్ వేర్పాటువాదులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయ వల్ల కశ్మీర్ వేర్పాటువాదుల పోరాటం త్వరలోనే నెరవేరుతుందని బాసిత్ చెప్పారు. మరోవైపు బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. ఇంతకన్నా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టిసారిస్తే మంచిదని భారత్ హితవు పలికింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









