అనుచిత వ్యాఖ్యలు చేసిన అబ్దుల్ బాసిత్
- March 23, 2017
భారత్లో పాకిస్థాన్ హై కమిషనర్గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ రాగం పాడారు. కాశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆయన మద్దతు పలికారు. కశ్మీర్ వేర్పాటువాదులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయ వల్ల కశ్మీర్ వేర్పాటువాదుల పోరాటం త్వరలోనే నెరవేరుతుందని బాసిత్ చెప్పారు. మరోవైపు బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. ఇంతకన్నా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టిసారిస్తే మంచిదని భారత్ హితవు పలికింది.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







