అనుచిత వ్యాఖ్యలు చేసిన అబ్దుల్ బాసిత్

- March 23, 2017 , by Maagulf
అనుచిత వ్యాఖ్యలు చేసిన అబ్దుల్ బాసిత్

భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్‌గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ రాగం పాడారు. కాశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్ వేర్పాటువాదులకు ఆయన మద్దతు పలికారు. కశ్మీర్ వేర్పాటువాదులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయ వల్ల కశ్మీర్ వేర్పాటువాదుల పోరాటం త్వరలోనే నెరవేరుతుందని బాసిత్ చెప్పారు. మరోవైపు బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. ఇంతకన్నా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టిసారిస్తే మంచిదని భారత్ హితవు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com