రైతులకు అండగా నిరసనలో పాల్గొన్న విశాల్ మరియు ప్రకాష్ రాజ్
- March 24, 2017
హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. మేకప్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి తమిళనాడు రైతులకు అండగా ఢిల్లీ నడివీధుల్లో గళమెత్తారు. విపరీతమైన కరువుతో తల్లడిల్లుతున్న తమిళనాడు రైతులకు న్యాయంచేయాలంటూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తోన్న ధర్నాలో ప్రకాష్ రాజ్, విశాల్ పాల్గొన్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. గత వారంరోజులుగా తమిళనాడు రైతుల ఢిల్లీలో తమ రోదనలను వినిపిస్తున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడకు రావాల్సివచ్చిందని ప్రకాష్ రాజ్, విశాల్ అన్నారు.
తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, కరువుతో అల్లాడుతున్న తమిళనాడును ఆదుకోవాలని.. కరువు సహాయకచర్యలు చేపట్టాలని.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ తమిళనాడు రైతులు మెడలో కపాలాలు ధరించి కరువు తీవ్రతను ప్రతిబింబించేలా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









