క్షమాబిక్ష కాలంలో స్వస్థలాలకు చేరుకొనేందుకు సహాయ డెస్కులు
- March 26, 2017
జెడ్డా : క్షమాబిక్ష అవకాశమున్నవారిని స్వస్థలాలకు పంపేందుకు సహాయ డెస్కులు ఏర్పాటుకు భారత దౌత్య మిషన్ సమాయుత్తమవుతుంది.కింగ్డమ్ లో వీసా నిబంధనలు ఉల్లంఘించినవారిపై సౌదీ అరేబియా కఠిన నిబంధనలను అమలుచేసే లోపున భారతీయులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పలు సహాయక చర్యలను తీసుకోనున్నారు. .కింగ్డమ్ ను ఇక " ఉల్లంఘనలు లేని దేశంగా " మార్చుతున్నట్లుగా ప్రచారం అధికారికంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే బుధవారం నుండి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ నుండి వారికి సహాయ పడేందుకు సన్నద్ధమవుతుంది. ఆచరణాత్మకంగా చూస్తే భారతీయుల సంఖ్య హజ్ వీసా హోల్డర్లు కింగ్డమ్ మరియు ఉమ్రా లో ఎక్కువకాలం ఉండిపోయినవారు దాదాపు ఎవరూ లేరు . అయితే, ఒక భారతీయ అధికారిక గణాంకాల ప్రకారం, ఉపాధి వీసా ఉల్లంఘించినవారు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అహ్మద్ జావేద్ కాన్సుల్ జనరల్ మహమ్మద్ నూర్ రెహమాన్ షేక్ ఇరువురు రాయబారులు శనివారం కమ్యూనిటీ నాయకులు కలిశారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు ఏ సమస్యలు లేకుండా కింగ్డమ్ వదిలివెళ్లేందుకు తగిన సహాయం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. క్షమాబిక్ష కాలంలో వారు క్షేమంగా ఇంటికి పంపించే కాలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భారత జాతీయులకు ఆ అధికారులు పిలుపునిచ్చారు. జెడ్డా కాన్సులేట్ తెలిపిన సమాచారం ప్రకారం, రాయబార కార్యాలయంలో10 సహాయ డెస్కులు వారి పరిధిలోని వివిధ సంస్థానాలలో మరో12 సహాయం డెస్కులు వారి కోసం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







