ప్రయాణీకులు సీటు బెల్టుని విస్మరిస్తే డ్రైవర్ కు 400 దిర్హాంల జరిమానా
- March 26, 2017
దుబాయ్: " సుబ్బి పెళ్ళి..వెంకీ చావుకి వచ్చిందన్నట్లుగా " తమ పరిస్థితి మారిందని యుఎఇ లో డ్రైవర్లు వాపోతున్నారు. తమ వాహనంలో ప్రయాణిస్తున్న వినియోగదారుడు ఎవరైనా పొరబాటున తమ సీట్ బెల్ట్ నడుంకు కట్టుకోపోతే, వారు చేసిన తప్పిదానికి డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకోవాలి. ప్రతి ప్రయాణీకుడికి 400 ధిర్హాంల చొప్పున జరిమానా ఉంటుందని ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ అధిపతి జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జాఫెయిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకవేళ డ్రైవర్ తన సీట్ బెల్ట్ ధరించి ఉన్నప్పటికి వెనుక సీట్లలలో ఉన్నఇతర ప్రయాణీకులు సీట్ బెల్ట్ లను ధరించి ఉండకపోతే, ఆ తప్పిదానికి డ్రైవర్ వారందరి తరుపున జరిమానా చెల్లించాలని ఆయన చెప్పారు. ట్రాఫిక్ క్రమశిక్షణ సమస్యలు మరియు ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర అమలు జూలై మొదటి వారంలో ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని జనరల్ అల్ జాఫెయిన్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







