అంగరంగ వైభవంగా ముస్తాబైన జిటెక్స్
- March 29, 2017
జిటెక్స్ షాపర్ స్ప్రింగ్ ఎడిషన్ 2017 అంగరంగ వైభవంగా ముస్తాబై ఆహూతుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ సెకెండ్ వైస్ ఛైర్మన్ ఆఫ్ ది బోర్డ్ - బుటి సయీద్ అల్ ఘాంది ఈ వేడుకిన ప్రారంభించారు. నాలుగు రోజులపాటు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద అద్భుతమైన షాపింగ్ అనుభూతిని షాపింగ్ ప్రియులకు అందించనుంది ఈ జిటెక్స్ షాపర్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బ్రాండ్స్, ఈ షాపింగ్ ఎగ్జిబిషన్లో తమ ప్రోడక్ట్స్ని ప్రదర్శన మరియు అమ్మకానికి ఉంచాయి. అన్ని వర్గాల ప్రజలకూ అనువైన షాపింగ్ ఇక్కడ కొలువుదీరింది. విద్యార్థులు, చిన్న పిల్లలు, మహిళలు ఇలా ఒకరేమిటి, అందరూ ఆనందోత్సాహాలతో షాపింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 300 దిర్హామ్ల మొత్తానికి ఏదన్నా వస్తువు కొనుగోలు చేసినవారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరించనుంది. ఈ ఏడాది జిటెక్స్ షాపర్ కోసం 20 దిర్హామ్లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







