సింగపూర్ లో వైభవంగా ఉగాది సంబరాలు
- April 02, 2017
శ్రీ హేవళంబినామ సంవత్సర ఉగాది పండుగను సింగపూర్ తెలుగు వారు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెరంగూన్ శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు సుప్రభాత సేవ, తిరు మంజనం, గరుడ వాహన సేవ, శ్రీనివాస కల్యాణం, పంచాంగ శ్రవణం మరియు అన్నదాన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహించారు.
వీనుల విందుగా జరిగిన శ్రీనివాస కల్యాణం వేడుకలో 1500 పైగా తెలుగు వారు మరియు 70 జంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా తెప్పించబడిన శ్రీవారి లడ్డు ప్రసాదము, అమ్మవారి కుంకుమ, ఉత్తరీయం, రవిక, అభిషేక జలం, వెండి నాణాలు ఇవ్వడం జరిగింది. చిన్నారుల గోవింద గీతాలతో, భక్తుల గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కల్యాణం అనంతరం జరిగిన పంచాంగ శ్రవణం అందినీ విశేషంగా అలరంచింది.
తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ రంగా రవి కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ రత్నకుమార్ ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
సమాజం కార్యకర్తలకు, సభ్యులకు, కల్యాణం జంటలకు, అన్నదాన దాతలకు, వాలంటీర్లకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







