సింగపూర్ లో వైభవంగా ఉగాది సంబరాలు
- April 02, 2017
శ్రీ హేవళంబినామ సంవత్సర ఉగాది పండుగను సింగపూర్ తెలుగు వారు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెరంగూన్ శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు సుప్రభాత సేవ, తిరు మంజనం, గరుడ వాహన సేవ, శ్రీనివాస కల్యాణం, పంచాంగ శ్రవణం మరియు అన్నదాన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహించారు.
వీనుల విందుగా జరిగిన శ్రీనివాస కల్యాణం వేడుకలో 1500 పైగా తెలుగు వారు మరియు 70 జంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా తెప్పించబడిన శ్రీవారి లడ్డు ప్రసాదము, అమ్మవారి కుంకుమ, ఉత్తరీయం, రవిక, అభిషేక జలం, వెండి నాణాలు ఇవ్వడం జరిగింది. చిన్నారుల గోవింద గీతాలతో, భక్తుల గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కల్యాణం అనంతరం జరిగిన పంచాంగ శ్రవణం అందినీ విశేషంగా అలరంచింది.
తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ రంగా రవి కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ రత్నకుమార్ ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
సమాజం కార్యకర్తలకు, సభ్యులకు, కల్యాణం జంటలకు, అన్నదాన దాతలకు, వాలంటీర్లకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







