రష్యాలో మెట్రో రైల్లో పేలుడు,10 మంది మృతి

- April 03, 2017 , by Maagulf
రష్యాలో మెట్రో రైల్లో పేలుడు,10 మంది మృతి

రష్యాలో మెట్రో రైల్లో భారీ పేలుడు జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఒక మెట్రో రైలు బోగీ బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ పేలుడులో పది మంది మృతి చెందినట్లు, 15 మంది గాయపడ్డట్టు అధికారులు ప్రకటించారు. స్థానిక మీడియా మాత్రం పది మంది వరకూ మరణించారని.. చాలా మంది గాయపడ్డారని పేర్కొంది. 

మెట్రో రైల్లో పేలుడుతో మూడు మెట్రో స్టేషన్లు మూసివేశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి.. జనం భయంతో పరుగులు తీశారు. పేలుడుకు కారణమేంటనేది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇది ఉగ్రదాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. రైలు బోగీ పేలుడులో ఛిద్రమవడంతో  మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com