సిరియాలో రసాయనిక దాడి.. 58 మంది మృతి
- April 04, 2017
సిరియాలో రసాయనిక దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రసాయనిక దాడిలో సుమారు 58 మంది మృతి చెందారు.
ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. సిరియా దళాలు లేదా రష్యా జెట్ విమానాలు ఈ రసాయనిక దాడులకు పాల్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో 200 మంది ఈ దాడి ప్రభావానికి లోనయ్యారు.
తాము కెమికల్ వెపన్స్ వాడటం లేదని సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2014 నుంచి 2015 మధ్య అసద్ సేనలు కనీసం మూడుసార్లు ఇలా రసాయనిక దాడులకు పాల్పడినట్లు ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
సల్ఫర్ ఏజెంట్ తో దాడి చేసి ఉంటారని, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.
మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







