సిరియాలో రసాయనిక దాడి.. 58 మంది మృతి

- April 04, 2017 , by Maagulf
సిరియాలో రసాయనిక దాడి.. 58 మంది మృతి

సిరియాలో రసాయనిక దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రసాయనిక దాడిలో సుమారు 58 మంది మృతి చెందారు.

ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. సిరియా దళాలు లేదా రష్యా జెట్ విమానాలు ఈ రసాయనిక దాడులకు పాల్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో 200 మంది ఈ దాడి ప్రభావానికి లోనయ్యారు.
తాము కెమికల్ వెపన్స్ వాడటం లేదని సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2014 నుంచి 2015 మధ్య అసద్ సేనలు కనీసం మూడుసార్లు ఇలా రసాయనిక దాడులకు పాల్పడినట్లు ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
సల్ఫర్ ఏజెంట్ తో దాడి చేసి ఉంటారని, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.
మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com