అమ్నెస్టీ కోసం వలసదారుల ఉరుకులు పరుగులు

- April 05, 2017 , by Maagulf
అమ్నెస్టీ కోసం వలసదారుల ఉరుకులు పరుగులు

జెడ్డా: అమ్నెస్టీ పీరియడ్‌ని వినియోగించుకునేందుకోసం వలసదారులు పరుగులు తీస్తున్నారు. గడువు తీరిన రెసిడెంట్‌ ఐడీలు కలవారు, అలాగే సౌదీజైషేన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నవారు, ఇతరత్రా కారణాలతో దేశం విడిచి వెళ్ళాల్సి ఉన్నవారు అమ్నెస్టీని వినియోగించుకోవాలనుకుంటున్నారు. అయితే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ (జవజాత్‌), అమ్నెస్టీ ద్వారా దేశం విడిచి వెళ్ళాలనుకునే కార్మికులు ముందుగా మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ బ్రాంచ్‌కి వెళ్ళి, సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తోంది. కానీ లేబర్‌ మినిస్ట్రీ ఆఫీస్‌ జెడ్డా మాత్రం జవజాత్‌కి రిఫర్‌ చేస్తోంది. జవజాత్‌ మళ్ళీ వారిని లేబర్‌ కార్యాలయానికి తిప్పి పంపుతోంది. ఈ వ్యవహారంపై లేబర్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలిద్‌ అబా అల్‌ ఖలిల్‌ స్పందించడంలేదు. ఈ తరహా సమస్యల పరిష్కారం కోసం భారత కాన్సుల్‌ జనరల్‌, సంబంధిత అధికారులతో చర్చలు ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ మొహమ్మద్‌ నూర్‌ రహ్మాన్‌ షేక్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com