అమ్నెస్టీ కోసం వలసదారుల ఉరుకులు పరుగులు
- April 05, 2017
జెడ్డా: అమ్నెస్టీ పీరియడ్ని వినియోగించుకునేందుకోసం వలసదారులు పరుగులు తీస్తున్నారు. గడువు తీరిన రెసిడెంట్ ఐడీలు కలవారు, అలాగే సౌదీజైషేన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నవారు, ఇతరత్రా కారణాలతో దేశం విడిచి వెళ్ళాల్సి ఉన్నవారు అమ్నెస్టీని వినియోగించుకోవాలనుకుంటున్నారు. అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), అమ్నెస్టీ ద్వారా దేశం విడిచి వెళ్ళాలనుకునే కార్మికులు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ బ్రాంచ్కి వెళ్ళి, సంబంధిత సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. కానీ లేబర్ మినిస్ట్రీ ఆఫీస్ జెడ్డా మాత్రం జవజాత్కి రిఫర్ చేస్తోంది. జవజాత్ మళ్ళీ వారిని లేబర్ కార్యాలయానికి తిప్పి పంపుతోంది. ఈ వ్యవహారంపై లేబర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలిద్ అబా అల్ ఖలిల్ స్పందించడంలేదు. ఈ తరహా సమస్యల పరిష్కారం కోసం భారత కాన్సుల్ జనరల్, సంబంధిత అధికారులతో చర్చలు ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కాన్సుల్ జనరల్ మొహమ్మద్ నూర్ రహ్మాన్ షేక్ చెప్పారు.
తాజా వార్తలు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే









