337 మోటార్ బైక్ల స్వాధీనం
- April 05, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్ సందర్భంగా గడచిన రెండు వారాల్లో మొత్తం 337 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన నేపథ్యంలో ఈ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, రస్ అల్ ఖైమా పోలీస్ - కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ చెప్పారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, రాత్రి వేళల్లో భారీ శబ్దం చేయడం వంటి ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడ్డట్లు ఆయన వివరించారు. యువకులు రాత్రి వేళ్ళలో తమ వాహనాలతో చేస్తున్న స్టంట్స్ సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్నాయనీ, అందుకే ఇలాంటి ఫీట్స్పై కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు అల్ అల్కీమ్. మార్చ్ 17న ఒక్క రోజే మొత్తం 51 మోటార్ బైక్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు 1000 దిర్హామ్ల జరీమానా, 24 బ్లాక్పాయింట్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









