337 మోటార్ బైక్ల స్వాధీనం
- April 05, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్ సందర్భంగా గడచిన రెండు వారాల్లో మొత్తం 337 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన నేపథ్యంలో ఈ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, రస్ అల్ ఖైమా పోలీస్ - కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ చెప్పారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, రాత్రి వేళల్లో భారీ శబ్దం చేయడం వంటి ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడ్డట్లు ఆయన వివరించారు. యువకులు రాత్రి వేళ్ళలో తమ వాహనాలతో చేస్తున్న స్టంట్స్ సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్నాయనీ, అందుకే ఇలాంటి ఫీట్స్పై కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు అల్ అల్కీమ్. మార్చ్ 17న ఒక్క రోజే మొత్తం 51 మోటార్ బైక్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు 1000 దిర్హామ్ల జరీమానా, 24 బ్లాక్పాయింట్స్ తప్పనిసరి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







