సౌదీ ఎడారిలో మృత్యువాత: తెలుగువ్యక్తి దీనగాధ

- April 10, 2017 , by Maagulf
సౌదీ ఎడారిలో మృత్యువాత: తెలుగువ్యక్తి దీనగాధ

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోగల మెదక్‌ జిల్లాకి చెందిన మన్నెల రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో హృదయ విదారక స్థితిలో మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ అతను మృతి చెందిన రెండేళ్ళ తర్వాత అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాములు చనిపోయిన తర్వాత 8 నెలలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్ళిన రాములు, కొన్ని కారణాలతో అనుకున్న ఉద్యోగం కాకుండా పశువుల కాపరిగా పనిచేయాల్సి వచ్చింది. ఎడారిలో పశువులను కాస్తుండగా తీవ్రమైన డీహైడ్రేషన్‌తో అక్కడే కుప్పకూలిపోయాడు. 2016 ఫిబ్రవరి 1న మరో ఆఫ్రికాకి చెందిన మరో పశువుల కాపరి, రాములు మృతదేహాన్ని గుర్తించాడు. అప్పటికే రాములు మృతదేహం చాలావరకు డీ కంపోజ్‌ అయిపోయింది. ఆఫ్రికా పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విచారణ చేపట్టి మృతుడిని గుర్తించారు. ఫోరెన్సిక్‌ పరీక్షలో ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే రాములు కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. రాములు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు వారు చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో చివరికి, అక్కడే బురైదాలో రాములు మృతదేహాన్ని ఖననం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com