సౌదీ ఎడారిలో మృత్యువాత: తెలుగువ్యక్తి దీనగాధ
- April 10, 2017
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోగల మెదక్ జిల్లాకి చెందిన మన్నెల రాములు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో హృదయ విదారక స్థితిలో మృతిచెందాడు. దురదృష్టవశాత్తూ అతను మృతి చెందిన రెండేళ్ళ తర్వాత అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాములు చనిపోయిన తర్వాత 8 నెలలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎన్నో ఆశలతో సౌదీకి వెళ్ళిన రాములు, కొన్ని కారణాలతో అనుకున్న ఉద్యోగం కాకుండా పశువుల కాపరిగా పనిచేయాల్సి వచ్చింది. ఎడారిలో పశువులను కాస్తుండగా తీవ్రమైన డీహైడ్రేషన్తో అక్కడే కుప్పకూలిపోయాడు. 2016 ఫిబ్రవరి 1న మరో ఆఫ్రికాకి చెందిన మరో పశువుల కాపరి, రాములు మృతదేహాన్ని గుర్తించాడు. అప్పటికే రాములు మృతదేహం చాలావరకు డీ కంపోజ్ అయిపోయింది. ఆఫ్రికా పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విచారణ చేపట్టి మృతుడిని గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఎనిమిది నెలల క్రితం ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే రాములు కుటుంబం అత్యంత పేదరికంలో మగ్గుతోంది. రాములు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు వారు చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాకపోవడంతో చివరికి, అక్కడే బురైదాలో రాములు మృతదేహాన్ని ఖననం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







