నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన 6మందికి పరిసరాలను శుభ్రం చేయాలనీ తీర్పు
- April 11, 2017
అబూధాబీ : స్టీరింగ్ చేతిలో ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు వాహనం నడిపితే, కుదరదక్కడ .పోనీ మన దేశంలో మాదిరిగా జరిమానా కట్టి జారుకుందామంటే అబూధాబీ లో అవకాశముండదు ..వళ్ళు హూనం అయ్యేలా ఆయా ఎంపిక చేసిన ప్రాంతాలలో నానా చాకిరి చేయిస్తారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన ఐదుగురు ఎమిరాటియులు మరియు ఒక జీసీసీ పౌరుడు పైన పేర్కొన్న కారణాలతో పోలీసులకు పట్టుబడ్డారు. అంతే ఇక వారితో మసీదులు శుభ్రం చేయించడం, రోడ్లను అద్దం మాదిరిగా ఊడ్పించడం, గ్రంధాలయాలలో దుమ్ము ధూళి బూజులు దూలపడం, పెట్రోల్ బంకులలో పని వంటి సామాజిక సేవా కార్యక్రమాలను బలవంతాన చేయిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ ఆరుగురు వ్యక్తులకు అబూధాబీ లో జనరల్ ప్రాసిక్యూషన్ ఈ తాజా సామాజిక సేవా శిక్షను జారీ చేసింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









