'మంత్రిగారి అల్లుడు' గా అల్లుడు శీను లోకల్ డైరెక్టర్ తో

- April 12, 2017 , by Maagulf
'మంత్రిగారి అల్లుడు' గా అల్లుడు శీను లోకల్ డైరెక్టర్ తో

అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో నిరాశపరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను  ప్లాన్ చేస్తున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ చిత్రాలతో ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com