'మంత్రిగారి అల్లుడు' గా అల్లుడు శీను లోకల్ డైరెక్టర్ తో
- April 12, 2017
అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో నిరాశపరిచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి సక్సెస్ చిత్రాలతో ఆకట్టుకున్న త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరో.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







