అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ దాడిలో 90మంది మృతి

- April 15, 2017 , by Maagulf
అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ దాడిలో 90మంది మృతి

అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబును జారవిడవడంతో హతమైన ఉగ్రవాదుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 90మంది ఐసిస్‌ ఉగ్రవాదులు మృతిచెందినట్లు అచిన్‌ గవర్నర్‌ ఇస్మాయిల్‌ షిన్వారీ మీడియాకు వెల్లడించారు. నాన్‌గర్హర్‌ ప్రావిన్స్‌ అధికారి ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లో గల నాన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లోని అచిన్‌ జిల్లాలో అమెరికా గురువారం అతిపెద్ద బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లాలోని సొరంగమార్గ సముదాయంపై జీజీయూ-43/బి బాంబును జార విడిచింది. ఈ దాడిలో ఐసిస్‌కు చెందిన మూడు భూగర్భ సొరంగాలు, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమయ్యాయి. అయితే తొలుత 36 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అఫ్గాన్‌ రక్షణశాఖ వెల్లడించగా.. శనివారం నాటికి ఆ సంఖ్య 90కు చేరినట్లు అధికారులు తెలిపారు. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా పిలిచే అతి శక్తిమంతమైన ఈ బాంబు 21,600 పౌండ్ల బరువుంటుంది.
తొలిసారిగా దీన్ని ఓ యుద్ధంలో ప్రయోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com