ఎఫ్బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఇండియన్
- April 19, 2017
ఎఫ్బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో 26 ఏళ్ల ప్రవాసభారతీయుడిని చేర్చింది. ఆ క్రిమినల్ గుజరాత్కి చెందిన భ్రదేశ్కుమార్. కుమార్ భార్య పలక్తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ స్థానిక రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. 2015 ఏప్రిల్లో భద్రేశ్ భార్యతో గొడవపడి రెస్టారెంట్లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు. ఇప్పటి వరకు కుమార్ ఆచూకీ దొరకలేదు. దాంతో ఎఫ్బీఐ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. ఇతన్ని పట్టిస్తే లక్ష డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. .
కుమార్ని పట్టుకుని అరెస్ట్ చేసేంతవరకు కేసు వదిలిపెట్టమని ఇందుకుప్రజలు కూడా సహకరిస్తే పని తేలికవుతుందని ఎఫ్బీఐ అధికారి జాన్సన్ మీడియాకు చెప్పారు. భద్రేశ్ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయి ఉంటుందని అతను అమెరికా వదిలి వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పారు. భద్రేశ్ భార్య పలక్ తిరిగి ఇండియా వెళ్లిపోదామని చెప్పేదని ఈ విషయంలోనే అతను గొడవపడి ఆమెను హతమార్చుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!