ఎఫ్బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఇండియన్
- April 19, 2017
ఎఫ్బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో 26 ఏళ్ల ప్రవాసభారతీయుడిని చేర్చింది. ఆ క్రిమినల్ గుజరాత్కి చెందిన భ్రదేశ్కుమార్. కుమార్ భార్య పలక్తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ స్థానిక రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. 2015 ఏప్రిల్లో భద్రేశ్ భార్యతో గొడవపడి రెస్టారెంట్లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు. ఇప్పటి వరకు కుమార్ ఆచూకీ దొరకలేదు. దాంతో ఎఫ్బీఐ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. ఇతన్ని పట్టిస్తే లక్ష డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. .
కుమార్ని పట్టుకుని అరెస్ట్ చేసేంతవరకు కేసు వదిలిపెట్టమని ఇందుకుప్రజలు కూడా సహకరిస్తే పని తేలికవుతుందని ఎఫ్బీఐ అధికారి జాన్సన్ మీడియాకు చెప్పారు. భద్రేశ్ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయి ఉంటుందని అతను అమెరికా వదిలి వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పారు. భద్రేశ్ భార్య పలక్ తిరిగి ఇండియా వెళ్లిపోదామని చెప్పేదని ఈ విషయంలోనే అతను గొడవపడి ఆమెను హతమార్చుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







