క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు
- April 20, 2017
అబుధాబి: అల్ అయిన్ జైలులో మగ్గుతున్న పది మంది భారతీయ యువ కార్మికులు, క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వీరి క్షమాభిక్షపై ఓ స్పష్టత రానుంది. అల్ అయిన్ అపీల్స్ కోర్ట్, బుధవారం ఈ కేసులో విచారణను పూర్తి చేసింది. మే 25వ తేదీకి తీర్పుని వాయిదా వేసింది. 2015లో ఓ పాకిస్తానీ వ్యక్తి హత్యకు సంబంధించి పది మంది భారతీయు యువకులపై అభియోగాలు మోపబడ్డాయి. మృతుడి కుటుంబీకులు, నిందితులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకో వైపున బ్లడ్ మనీ చెల్లించేందుకు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఎస్పిఎస్ ఒబెరాయ్ ముందుకొచ్చారు. ఇప్పటిదాకా ఒబెరాయ్ 78 మందికి ఇదే విధంగా బ్లడ్ మనీని చెల్లించి వారిని మరణ శిక్ష నుంచి తప్పించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









