విదేశాలలో 'తెలంగాణ జాగృతి' అధ్యక్షుల నియామకం
- April 20, 2017
ప్రవాసీయులలో మరింత పట్టుకోసం తెలంగాణ జాగృతి మరో ముందడుగు వేసింది. విదేశాలలో తమ శాఖలను విస్తరిస్తోంది. విదేశాలలో బతుకమ్మలతో హోరెత్తించిన జాగృతి ఇకపై బంగారు తెలంగాణ, ప్రవాసీయుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పని చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గల్ఫ్లోని ఆరు దేశాలకు జాగృతి అధ్యక్షుడిగా సీహెచ్. హరిప్రసాద్ను నియమించారు. ఉత్తర అమెరికా దేశాలకు బండారు శ్రీధర్, యూరప్కు ధన్నంనేని సంపత్లను నియమించినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్లోని సౌదీ అరేబియా శాఖకు అధ్యక్షునిగా మోజ్జం అలీ ఇఫ్తెఖార్ను నియమించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన 17 సంవత్సరాల నుంచి సౌదీలో తెలంగాణ వాదం వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖకు అధ్యక్షుడిగా పీచర్ల కిరణ్ కుమార్ను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆయన షార్జాలో కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కువైట్ అధ్యక్షునిగా నియమించబడ్డ ముత్యాల వినయ్ కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కువైట్లో తెలంగాణ జాగృతికి మొదటి నుంచి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. బహ్రెయిన్ జాగృతి అధ్యక్షునిగా నియమితుడైన బర్కుంట బాబురావు కవితకు వీరాభిమాని, అక్కడి జాగృతి కార్యకలాపాలను ఆయన ముందుండి నడిపిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







