విదేశాలలో 'తెలంగాణ జాగృతి' అధ్యక్షుల నియామకం
- April 20, 2017
ప్రవాసీయులలో మరింత పట్టుకోసం తెలంగాణ జాగృతి మరో ముందడుగు వేసింది. విదేశాలలో తమ శాఖలను విస్తరిస్తోంది. విదేశాలలో బతుకమ్మలతో హోరెత్తించిన జాగృతి ఇకపై బంగారు తెలంగాణ, ప్రవాసీయుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పని చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గల్ఫ్లోని ఆరు దేశాలకు జాగృతి అధ్యక్షుడిగా సీహెచ్. హరిప్రసాద్ను నియమించారు. ఉత్తర అమెరికా దేశాలకు బండారు శ్రీధర్, యూరప్కు ధన్నంనేని సంపత్లను నియమించినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్లోని సౌదీ అరేబియా శాఖకు అధ్యక్షునిగా మోజ్జం అలీ ఇఫ్తెఖార్ను నియమించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన 17 సంవత్సరాల నుంచి సౌదీలో తెలంగాణ వాదం వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖకు అధ్యక్షుడిగా పీచర్ల కిరణ్ కుమార్ను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆయన షార్జాలో కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కువైట్ అధ్యక్షునిగా నియమించబడ్డ ముత్యాల వినయ్ కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కువైట్లో తెలంగాణ జాగృతికి మొదటి నుంచి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. బహ్రెయిన్ జాగృతి అధ్యక్షునిగా నియమితుడైన బర్కుంట బాబురావు కవితకు వీరాభిమాని, అక్కడి జాగృతి కార్యకలాపాలను ఆయన ముందుండి నడిపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









