విదేశాలలో 'తెలంగాణ జాగృతి' అధ్యక్షుల నియామకం
- April 20, 2017
ప్రవాసీయులలో మరింత పట్టుకోసం తెలంగాణ జాగృతి మరో ముందడుగు వేసింది. విదేశాలలో తమ శాఖలను విస్తరిస్తోంది. విదేశాలలో బతుకమ్మలతో హోరెత్తించిన జాగృతి ఇకపై బంగారు తెలంగాణ, ప్రవాసీయుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పని చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గల్ఫ్లోని ఆరు దేశాలకు జాగృతి అధ్యక్షుడిగా సీహెచ్. హరిప్రసాద్ను నియమించారు. ఉత్తర అమెరికా దేశాలకు బండారు శ్రీధర్, యూరప్కు ధన్నంనేని సంపత్లను నియమించినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్లోని సౌదీ అరేబియా శాఖకు అధ్యక్షునిగా మోజ్జం అలీ ఇఫ్తెఖార్ను నియమించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన 17 సంవత్సరాల నుంచి సౌదీలో తెలంగాణ వాదం వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖకు అధ్యక్షుడిగా పీచర్ల కిరణ్ కుమార్ను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆయన షార్జాలో కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కువైట్ అధ్యక్షునిగా నియమించబడ్డ ముత్యాల వినయ్ కుమార్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కువైట్లో తెలంగాణ జాగృతికి మొదటి నుంచి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. బహ్రెయిన్ జాగృతి అధ్యక్షునిగా నియమితుడైన బర్కుంట బాబురావు కవితకు వీరాభిమాని, అక్కడి జాగృతి కార్యకలాపాలను ఆయన ముందుండి నడిపిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









