స్మార్ట్ సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం
- April 20, 2017
మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వశాఖ " సుందర నగర భావనల వినియోగం" ప్రారంభించింది. నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 2020, విజన్ ౨౦౩౦ భాగంగా పురపాలక పరిణామ పథకాలలో ఒక దానిని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్పిఏ) సోమవారం ప్రచురించింది.నగరంలో పట్టణ అభివృద్ధిని మెరుగుపరచడం, నగరాల యొక్క పట్టణీకరణ మరియు పట్టణ నిలకడ సామర్థ్యాన్ని పెంచడం, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం వంటి స్మార్ట్ నగర కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ ఏర్పాటు లక్ష్యంతో ఉంది. నగర నిర్వహణ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, స్థానిక మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉద్యోగ అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు ఈ ప్రణాళిక పిలుపునిచ్చింది.2020 నాటికి ఐదు సౌదీ నగరాలను స్మార్ట్ సిటీ ఏర్పాటుకు లక్ష్యంగా చేసుకుని, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో క్రమక్రమంగా చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మార్ట్ నగరాలు, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, స్మార్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్, స్మార్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ (వైఫై), స్మార్ట్ వర్షం మరియు వరదలు డ్రైనేజ్ నెట్వర్క్లు, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్స్, సత్వర అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, మరియు స్మార్ట్ ఆర్ధిక వ్యవస్థ చిన్న, మధ్య మరియు పెద్ద సంస్థలకు మద్దతుగా ఈ చర్యలు కొనసాగనున్నాయి
తాజా వార్తలు
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!









