ఇంధన ట్యాంకర్ ను ' ఢీ ' కొట్టిన కారు మంటలలో సజీవ దహనమైన టాక్సీ డ్రైవర్
- April 21, 2017
స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 33 టన్నుల పెట్రోలియంను తీసుకెళుతున్నఇంధన ట్యాంకర్ ను ఓ కారు వేగంగా ఎదురుగా వచ్చి ' ఢీ ' కొట్టిన ఘటనలో టాక్సీ డ్రైవర్ కాలి బుగ్గిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సివిల్ డిఫెన్స్ తెల్పింది. ఈ ప్రమాదంపై త్వరితగతిన జోక్యం చేసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఈ వాహనాలు ఒకదానితో ఒకటి 'ఢీ' కొన్నాయి. దీంతో శుక్రవారం ఉదయం జెడ్డా-మక్కా వేగవంతమైన మార్గంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. కనీసం మరో రెండు కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయిని మక్కా సివిల్ డిఫెన్స్ ప్రతినిధి నఇఫ్ అల్-షరీఫ్ చెప్పారు. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మంటలలో సజీవ దహనం కాగా మరో ముగ్గురు ఈ ప్రమాదం నుండి రక్షించబడ్డారు. అగ్నికీలలలో బూడిదగా మాదిరిపోయిన ఆ కారు డ్రైవర్ ఎవరో వెంటనే గుర్తించబడలేదు. శుక్రవారం వేకువజామున 1గంటకు ఈ దుర్ఘటన జరిగింది. మక్కా నుండి అగ్నిమాపక బృందాలు హుటాహుటిన సన్నివేశానికి చేరుకొన్నారు తెలిపారు. అగ్నిమాపక దళాలు ఆయిల్ టాంకర్ ...కారు నుంచి వెలువడుతున్న మంటల్ని అదుపు చేసిన తర్వాత హైవేలో వెదచల్లబడిన చమురు తెట్టుని తొలగించారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









