తమిళనాడులో కమల్‌హాసన్‌కు సమన్లు

- April 22, 2017 , by Maagulf
తమిళనాడులో కమల్‌హాసన్‌కు సమన్లు

కమల హాసన్ మరో వివాదంలో పడ్డారు. కమల హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది.ఇటివల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ . ''మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?'' అంటూ మహాభారతంపై హాట్ కామెంట్స్ చేశారు కమల్ .
ఇప్పుడీ కేసులో ఆయనకు తమిళనాడులోని వల్లియూర్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మహాభారతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఓ వ్యక్తి పిటిషన్‌ వేశారు. ఈ మేరకు మే 5న కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com