వాట్సాప్ అడ్మిన్లూ.. జర జాగ్రత్త!
- April 23, 2017
వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అయినవారిని వారణాసిలోని ఉన్నతాధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెడితే.. సంబంధిత సోషల్ మీడియా గ్రూప్కు చెందిన అడ్మినిస్ట్రేటరే అందుకు బాధ్యలవుతారని అక్కడి జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) యోగేశ్వర్ రామ్మిశ్రా, ఎస్పీ నితిన్ తివారి వార్నింగ్ ఇస్తున్నారు. ఈమేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీచేశారు.
గ్రూపులో మతపరమైన విద్వేషాలకు దారితీసే కంటెంట్గానీ, తప్పుడు సమాచారంగానీ ఉన్న పక్షంలో సంబంధిత సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని, జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుందని ప్రకటించారు. తప్పుడు సమాచారం లేదా కల్పిత (మార్ఫ్ చేసిన) ఫోటోలను, ఒకరి ప్రతిష్టకు భంగం కల్పించే వీడియోల పోస్టింగులను నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామంటూ వారు పేర్కొన్నారు. గ్రూప్పై పోస్ట్ చేసే కంటెంట్కి అడ్మిన్లే బాధ్యులని స్పష్టం చేశారు. అయితే.. తమ గ్రూపుల్లో పోస్ట్ చేసే సమాచారానికి, వాట్సాప్ అడ్మిన్లు బాధ్యలు కారని గత ఏడాది ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం గమనార్హం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









