చిరంజీవి 151 సినిమా ఆగస్ట్ నుంచి
- April 26, 2017
''ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద రోజుల ఆడటం కష్టం. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా 'ఖైదీనంబర్ 150' సినిమా వందరోజులు ఆడిందంటే అది అభిమానుల వల్లే. ఆ ఉత్సాహంతో నాన్న 151వ సినిమాను ఆగస్ట్లో ప్రారంభించబోతున్నాం.. ఇప్పటి వరకూ కనిపించని పాత్రల్లో ఆయన కనిపిస్తారు'' అని రాంచరణ్ అన్నారు. మండుటెండల్లో కూడా 20రోజులుగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారాయన. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాంచరణ్ మాట్లాడుతూ ''నాన్న సినిమా ఆగస్ట్లో మొదలుపెడతాం. బాబాయ్ ఎండల్ని కూడా లెక్క చేయకుండా అభిమానుల కోసం సినిమా చేస్తున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
రాజకీయ పరంగా, ఇంకే రకంగా అయినా బాబాయ్ చేసే ప్రతి కార్యక్రమానికి అభిమానులు అండగా ఉండాలి. నా సినిమా విషయానికొస్తే సుకుమార్ మంచి కథ చెప్పారు. అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తుందీ సినిమా'' అని అన్నారు. ''20 రోజులుగా పోలవరం, టేకూరు గిరిజన ప్రాంతాల్లో, ఫోన్ కూడా పనిచేయని ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నారు చరణ్.
ఆదివారం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేశాం. షూటింగ్ చూడడానికి వచ్చిన ఓ అభిమాని కుమారుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే చరణ్ స్వయంగా వైద్య సదుపాయాలు కల్పించారు'' అని స్వామినాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







