దాదా ఫాల్కే అవార్డ్ గ్రహీత విశ్వనాథ్ ను సన్మానించిన పవన్ మరియు త్రివిక్రమ్
- April 26, 2017
భారత దేశం గర్వించ దగ్గ దర్శక దిగ్గజం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి 2016 కి గాను కేంద్ర ప్రభుత్వం దాదా ఫాల్కే అవార్డ్ ను ప్రకటించింది. ఈ నేపద్యంలో తెలుగు సినీపరిశ్రమ నటీనటులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. పలువు తమ సోషల్ మీడియా ద్వారా కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలియజేస్తే.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విశ్వనాథ్ గారివద్దకు వెళ్ళి విశెష్ తెలియజేశారు.. తాజాగా ఈ రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు కె. విశ్వనాథ్ గారిని కలిసి దాదా ఫాల్కే అవార్డ్ ను అందుకోనున్నందుకు తమ శుభాభినందనలు తెలియజేశారు. విశ్వనాథ్ గారికి పూలబోకెలను అందించిన పవన్ త్రివిక్రమ్ శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు.. మే 3 న విశ్వనాథ్ గారు స్వర్ణ కమలం అందుకొన్న సంగతి విధితమే.. కాగా ఈ అవార్డ్ ను విశ్వనాథ్ గారికి ప్రకటించడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తూనే.. ఇప్పటికే ఈ అవార్డ్ ఆలస్యంగా వచ్చింది.. అయినా వచ్చినందుకు ఆనందం అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







