డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక వైద్య విధానాలు
- October 03, 2015
డ్రగ్స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త నిబంధనల్ని రూపొందించారు. ఇప్పటికే పలు ప్రైవేటు ఆసుపత్రులు డ్రగ్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నా, వాటిల్లో చాలావరకు లైసెన్స్ లేనివే. సమస్య తీవ్రతను తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా డ్రగ్స్ బాధితులకు సాంత్వన చేకూర్చేలా ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని వెల్లడించింది. 2013 నాటికి సుల్తానేట్లో డ్రగ్స్ బాధితుల సంఖ్య 4079గా ఉంది. 2015లో ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోవడంతో యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు నేషనల్ కమిషన్ ఆన్ డగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎఫైర్స్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ జహెర్ అల్ అబ్రి వివరించారు. డ్రగ్స్పై నిషేధం ఇంకా కఠినంగా అమలు చేయడం, బాధితులు డ్రగ్స్ వైపు వెళ్ళకుండా చేయడం వంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మిషన్ ద్వారా చేపట్టనున్నారట.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







