పాల తాళికలు
- April 26, 2017
కావలసిన పదార్థాలు : బియ్యం పిండి-పెద్ద గ్లాసు, పాలు-ఒక లీటరు, నీళ్ళు-ఒక లీటరు, సగ్గుబియ్యం-అర కప్పు, మైదాపిండి-అర కప్పు, బెల్లం-అర కిలో, పంచదార-ఒక కప్పు, జీడిపప్పు, కిస్మిస్-50గ్రా, యాలకుల పొడి-ఒక టీస్పూన్, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : మందపాటి గిన్నె స్టవ్పై ఉంచి అందులో పాలు, నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో గిన్నెలో బియ్యంపిండి, మైదాపిండి, ఒక స్పూను బెల్లం, కొంచెం ఉప్పు వేసి మరిగే పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి, చక్రాల గిద్దలతోగాని, పాలతాళికల మూకుడుతోగాని పిండిని వత్తాలి. ఆఖర్లో చక్రాల గిద్దల్లోగాని, మూకుడులోగాని మిగిలిన పిండిలో కాసినినీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లను కూడా దాంట్లోనే పోయాలి. బెల్లాన్ని మెత్తగా దంచి అందులో కప్పు పంచదార కలిపి, కప్పు నీల్లు పోసి తీగపాకం పట్టుకుని ఈ పాకాన్ని ఉడుకుతున్న పాల తాళికల గిన్నెలో పోసి యాలకుల పొడి వేయాలి. తినేటప్పుడు నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ పైన చల్లుకోవాలి.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







