భారీ దోపిడీ హాలివుడ్ సినిమాను తలపించేలా
- April 26, 2017
ఇది సినిమా కాదు. బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లో జరిగిన యదార్థ ఘటన. పరాగ్వే సరిహద్దు నగరం సియుడాడ్ డెల్ ఎస్టేలో సినిమాలను తలదన్నే దోపిడీ జరిగింది. నగదు సరఫరాచేసే ప్రైవేట్ సంస్థపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు.
దోపిడీ జరిగింది ఏ అర్థరాత్రో ..అపరాత్రో కాదు. పట్టపగలు ఏకంగా 50 మంది దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. దొంగలు మొదట బ్రెజిల్ నుంచి సరిహద్దులు దాటి పరాగ్వేలోని సియుడాడ్ డెల్ ఎస్టే నగరంలోకి చొరబడ్డారు. ప్రొసెగర్ అనే ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలోని ఖజానా వారి టార్గెట్. నగదును సురక్షితంగా సరఫరా చేసే సంస్థ అది. వారు దాడిచేసే సమయానికి ఆ వాల్ట్ పూర్తిగా నగదుతో నిండి ఉంది. ఆ సొమ్ము విలువ 40 మిలియన్ డాలర్లు.
అధునాతన వాహనాల్లో అక్కడికి చేరుకున్న దొంగలు భారీ పేలుడు పదార్థాలతో, డైనమైట్లతో సంస్థ ముందు భాగాన్ని పేల్చివేసి లోపలికి చొరబడ్డారు.మొత్తం ఖజానాను కొల్లగొట్టి వెనుదిరిగారు. ఆ పేలుడు శబ్దాలకు అప్రమత్తమైన పోలీసులు అక్కడికి రాకుండా దుండగుల్లో కొందరు వేరయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు కార్లు, ట్రక్కులు, లారీలను తగలబెట్టేశారు. టైర్లను పంక్చర్ చేసే ఇనప ముక్కలు దారిలో వెదజల్లారు. బ్రెజిల్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ దుండగులను పరాగ్వే పోలీసులు వెంటాడారు. సమాచారం తెలుసుకున్న బ్రెజిల్ పోలీసులుకూడా వారికి జత కలిశారు.
దొంగలు ఇరుదేశాల పోలీసులపైనా హోరాహోరీగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించగా.. ముగ్గురు దొంగలు హతమయ్యారు. మరో నలుగురు తీవ్రగాయాలపాలై పోలీసులకు దొరికిపోయారు. మిగతావారు తప్పించుకున్నారు. దుండగులకు చెందిన కొన్ని వ్యాన్లను, లైఫ్ జాకెట్లను, మెషీన్గన్లను, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైనమైట్లు పేల్చి భవంతిని పేల్చేశారు. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ భారీ దోపిడీని పరాగ్వే అధికారులు ఈ శతాబ్దపు దోపిడీగా అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







