రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకు సిద్ధం
- October 03, 2015
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాళ్లు, ఇటుకలతోపాటు ఇప్పుడు డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకే చంద్రబాబు రెడీ అవుతున్నారు. అసలు ఈ డిజిటల్ బ్రిక్స్ అంటే ఏంటి ? వాటిని ఎలా వాడతారో మీరే చూడండి. భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి ? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజథాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి.? సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఇంటికో ఇటుక ఇవ్వాలా? లేకపోతే..ఇటుకతో సమానమైన డబ్బును విరాళంగా ఇవ్వాలా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం..మీరు శ్రమటోడ్చి ఇటుకను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటుకతో సమానమైన డబ్బును ఆన్లైన్ అకౌంట్లో జమచేస్తే చాలు. అంతే మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనట్లే..మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదెలాగో చూడండి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్రిక్స్ డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







