2017 నాటికి ఖతార్లో 85 మంది భారతీయ నివాసులు మృతి
- April 28, 2017
కతర్ : భారతీయ రాయబార కార్యాలయం కమ్యూనిటీ హౌస్ నెల వారీ తన నివేదికలో 2017 నాటికి ఖతార్ లో 85 మంది భారతీయ నివాసులు మరణించినట్లు పేర్కొంది. డేటా ప్రకారం, 191 మంది సెంట్రల్ జైలులో ఉండగా, వారిలో116 మందిని దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ, క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్'స్ బహిష్కరణ కేంద్రంలో ఉంచారు.అదేవిధంగా, 31 మందికి అత్యవసర సర్టిఫికేట్లను ఈ నెలలో భారత రాయబార కార్యాలయం జారీ చేసి స్వదేశానికి పంపింది. వారి స్వదేశానికి తిరిగి రావాలంటే 12 విమాన టిక్కెట్లు కూడా వారికి భారతీయులకు అందించబడ్డాయి. భారతీయ సమాజంలో సంక్షేమ చర్యలు చేపట్టడంలో భారతీయ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ గొప్ప పాత్ర పోషిస్తున్నది, ఇటీవల 200 మంది భారతీయ జాలర్లకు ఆరోగ్య కార్డులను అందచేయడంలో సహాయపడింది.ఈ ఫోరమ్లో ఎనిమిది మంది భారతీయులకు దుకాణాలు నెలకొల్పేందుకు సహాయం చేశారు రాయబారి పి కుమరన్, మిషన్ డిప్యూటీ చీఫ్ ఆర్.కె. సింగ్ మరియు ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఫిర్యాదుదారులను అందర్నీ కలుసుకున్నారు, వారి సమస్యలను గురించి వివరంగా చర్చించారు మరియు కతర్ ప్రభుత్వానికి సంబంధిత అధికారులతో వారిపై నమోదు కాబడిన కేసులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







