2017 నాటికి ఖతార్లో 85 మంది భారతీయ నివాసులు మృతి

- April 28, 2017 , by Maagulf
2017 నాటికి ఖతార్లో 85 మంది భారతీయ నివాసులు మృతి

కతర్ : భారతీయ రాయబార కార్యాలయం కమ్యూనిటీ హౌస్  నెల వారీ తన నివేదికలో 2017 నాటికి ఖతార్ లో 85 మంది భారతీయ నివాసులు మరణించినట్లు పేర్కొంది. డేటా ప్రకారం, 191 మంది సెంట్రల్ జైలులో ఉండగా, వారిలో116 మందిని దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ, క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్'స్ బహిష్కరణ కేంద్రంలో ఉంచారు.అదేవిధంగా, 31 ​​మందికి అత్యవసర సర్టిఫికేట్లను ఈ నెలలో భారత రాయబార కార్యాలయం జారీ చేసి స్వదేశానికి పంపింది. వారి స్వదేశానికి తిరిగి రావాలంటే 12 విమాన టిక్కెట్లు కూడా వారికి భారతీయులకు అందించబడ్డాయి. భారతీయ సమాజంలో సంక్షేమ చర్యలు చేపట్టడంలో భారతీయ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ గొప్ప పాత్ర పోషిస్తున్నది, ఇటీవల 200 మంది భారతీయ జాలర్లకు ఆరోగ్య కార్డులను అందచేయడంలో  సహాయపడింది.ఈ ఫోరమ్లో ఎనిమిది మంది భారతీయులకు దుకాణాలు నెలకొల్పేందుకు సహాయం చేశారు రాయబారి పి కుమరన్, మిషన్ డిప్యూటీ చీఫ్ ఆర్.కె. సింగ్ మరియు ఇతర రాయబార కార్యాలయ అధికారులు ఫిర్యాదుదారులను అందర్నీ  కలుసుకున్నారు, వారి సమస్యలను గురించి వివరంగా చర్చించారు మరియు కతర్ ప్రభుత్వానికి సంబంధిత అధికారులతో వారిపై నమోదు కాబడిన కేసులను పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com