ఒమన్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి

- April 28, 2017 , by Maagulf
ఒమన్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి

మస్కట్‌: ఒమన్‌లోని హైమా వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు, ట్రక్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 34 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సలాలా లైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ఒకరు ఇండియన్‌ కాగా, ఇంకొకరు పాకిస్తానీ. ప్రమాదంలో గాయపడ్డవారిలో చాలామంది ఆసియాకి చెందినవారేనని పోలీసు అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com