దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు
- April 29, 2017
మేనల్లుడి పనైపోయింది.. ఇక చిన్నమ్మకు ఉచ్చు బిగుసుకుంటోంది. అవును.. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపే ప్లాన్.. శశికళ మదిలోంచే పుట్టిందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దీనికి ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. ఈ కేసులోనూ అరెస్టయ్యే అవకాశం మెండుగా కన్పిస్తోంది. అధికారం కోసం శశికళ వేసిన ఎత్తులన్నీ చిత్తవడమే కాదు.. ఇప్పుడామె మెడకు మరో కేసు బిగుసుకుంటోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో.. దినకరన్ తో పాటు శశికళపైనా కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. లంచం వ్యవహారం సూత్రధారి శశికళేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు. ఆమె సూచన మేరకే దినకరన్ ఈ కథ నడిపారనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. లంచం కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు వేగం పెంచారు. బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ఓ హవాలా ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హవాలా వ్యాపారి ద్వారానే సుఖేష్ కు దినకరన్ అడ్వాన్స్ సొమ్ము అందజేశాడని సమాచారం. అలాగే సుఖేష్ అనుచరుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దినకరన్ తో సహా ఐదుగురు అరెస్టయ్యారు. ఇక ఇదే కేసులో శశికళపై అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ.. తర్వాత ముఖ్యమంత్రి కావడానికి పావులు కదిపారు. ఈలోగా సుప్రీం కోర్టు తీర్పుతో జైలుకువెళ్లారు. తన మేనల్లుడు దినకరన్ ను ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పంచడం, రెండాకుల గుర్తు కోసం లంచం ఇవ్వజూపడం అంతా శశికళ ప్లాన్ అంటున్నారు. ఈ కేసులోనూ శశికళను అరెస్ట్ చేస్తే ఆమెకు చిక్కులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళ రాజకీయాల్లో, అన్నాడీఎంకేలో శశికళకు ఏమాత్రం ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. ఇలా మన్నార్ గుడి మాఫియా ఖేల్ ఖతం అయినట్లేనంటున్నారు విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







