జోర్డాన్ పార్లమెంట్ ఎంపీ మాజెన్ దలాయిన్ కుమారుడు ఐఎస్ లో చేరాడు
- October 04, 2015
తన కుమారుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడని జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడొకరు బాంబు పేల్చారు. అంతేకాదు ఇరాక్ లో ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. 23 ఏళ్ల తన కుమారుడు మహ్మద్.. ఐఎస్ లో చేరాడని జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ తెలిపారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న అతడిని జూన్ నెలలో చివరిసారిగా చూశామని అసోసియేటెడ్ ప్రెస్ తో చెప్పారు. టర్కీ, సిరియా మీదుగా అతడు ఇరాక్ వెళ్లాడని వెల్లడించారు. అతడిని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన వాపోయారు. తమ కుమారుడు మీతి చెందినట్టు శనివారం గుర్తించామని చెప్పారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన ఆత్మహుతి దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్ సైట్ లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నాడని మాజెన్ దలాయిన్ వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









