బహ్రెయిన్ పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య
- October 04, 2015
బహ్రెయిన్లో పార్కుల అభివృద్ధికి నిధుల సమస్య వెంటాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో, ముడిచమురు అమ్మకాలే ప్రధాన ఆదాయం కలిగిన బహ్రెయిన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పార్కుల అభివృద్ధి కోసం కొత్తగా నిధుల కేటాయింపు కష్టమని సదరన్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ అహ్మద్ అన్సారీ చెప్పారు. 40 పార్క్లను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించినా, వాటి అభివృద్ధి ఇప్పట్లో జరిగేందుకు పరిస్థితులు ప్రస్తుతం అనుకూలించడంలేదు. బహ్రెయిన్ బడ్జెట్ లోటు 1.5 బిలియన్లకు చేరుకోవడంతో ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగానే మాంసంపైనా సబ్సిడీని ఎత్తివేశారు. పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని పాలకులు కోరుతున్నారు. అయితే పార్కులు, పర్యాటక ప్రదేశాల్లోని సౌకర్యాల లేమి తమకూ బాధ కలిగిస్తుందని, ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే, అభినందిస్తామని అహ్మద్ అన్సారీ చెప్పారు. ఇంకా బడ్జెట్ కేటాయింపులు జరగనందున పార్కుల అభివృద్ధిపై ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదనీ, ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతైనా పార్కుల కోసం నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అహ్మద్ అన్సారీ.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







