దుబాయ్ లో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు ప్రోత్సాహక కార్యక్రమం

- May 04, 2017 , by Maagulf
దుబాయ్ లో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు  ప్రోత్సాహక కార్యక్రమం

:చేపల పెంపక కార్యక్రమంలో తొలి దశను దుబాయ్ లో ప్రారంభించారు. డిప్యూటీ  ఛైర్మన్ అఫ్ పోలీస్ అండ్ జనరల్ సెక్యూరిటీ ఇన్ దుబాయ్ మారిటైమ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రొటెక్షన్ ఆఫ్ చైర్మన్ జనరల్ దహి ఖల్ఫాన్ టమీమ్, డి పి వరల్డ్ గ్రూప్ సి ఇ ఓ మరియు ఛైర్మెన్  పోర్ట్స్, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్  సుల్తాన్ బిన్ సులైమ్ సమక్షంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సెవెన్  టైడ్స్ ఇంటర్నేషనల్, ప్రైవేట్ యాజమాన్యం లోని లగ్జరీ ఆస్తి డెవలపర్ హోల్డింగ్ కంపెనీ, దుబాయ్ లో చేపల ఉత్పత్తి  ప్రోత్సహించడానికి లక్ష్యంతో కార్యక్రమం కొనసాగనుంది.స్థానిక రకాలకు చెందిన మూడు వేల చేపలు ప్రపంచ ద్వీపాలకు సమీప జలాల్లో విడుదల చేశారు. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు నిర్బంధంలో ఆ చేపలను పెంచడం జరిగింది. దుబాయ్ పోలీస్లో కమ్యూనిటీ హ్యాపీనెస్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ మర్రి, అబ్దుల్లా బిన్ సులైమ్, సెవెన్ టైడ్స్ ఇంటర్నేషనల్ సిఈఓ, ఖలీల్ సకర్ బిన్ ఘరిబ్, దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ ఆఫ్ కార్పోరేట్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యు.ఎ. ఇ లో చేపల ఉత్పత్తిని ప్రోత్సాహించి వాటిని పెంచుకోవటానికి ఉద్దేశించిన చొరవను జనరల్ దహి ఖల్ఫాన్ టమీమ్ ప్రశంసించాడు.సముద్ర వాతావరణాన్ని కాపాడటానికి మరియు ఈ విషయంలో ప్రజా అవగాహన పెంచడానికి యుఎఇ ప్రయత్నాల్లో భాగంగా ఉందని ఆయన చెప్పారు.రెండవ దశ చేపలను వదలడం సెప్టెంబరు నెలలో మొదలవుతుందని  3,000 నుంచి 4,000 చేపలను విడుదల చేయడం జరుగుతుందని అవుతుందని సుల్తాన్ బిన్ సులైమ్ తెలిపారు. గతంలో బాధ్యతారహితమైన చేపల వేట కారణంగా మత్స్య సంపద కనుమరుగైందని పేర్కొంటూ, అందుకు తగిన  ప్రణాళికలు మరియు మార్గదర్శకాలను పెంపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com