పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్
- May 04, 2017
కిమ్స్ లో సుధీర్ఘ చికిత్స పొందిన ప్రముఖ దర్శకుడు..దర్శకరత్న దాసరినారాయణరావు మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందన్నారు. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని చిరంజీవి దాసరికి అందజేశారు. అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లైఫ్ లో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. తాను తీసిన ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య నటించారని ఆయనకు ప్రత్యామ్నాయంలేదని దాసరి చెప్పారు. కాగా, చిరంజీవి, మోహన్బాబు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులంతా దాసరి ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఉదయం నుంచీ జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసం రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానుల రాకతో సందడిగా మారింది.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







