పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్
- May 04, 2017
కిమ్స్ లో సుధీర్ఘ చికిత్స పొందిన ప్రముఖ దర్శకుడు..దర్శకరత్న దాసరినారాయణరావు మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందన్నారు. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని చిరంజీవి దాసరికి అందజేశారు. అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లైఫ్ లో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. తాను తీసిన ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య నటించారని ఆయనకు ప్రత్యామ్నాయంలేదని దాసరి చెప్పారు. కాగా, చిరంజీవి, మోహన్బాబు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులంతా దాసరి ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఉదయం నుంచీ జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసం రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానుల రాకతో సందడిగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









