పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్

- May 04, 2017 , by Maagulf
పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్

కిమ్స్ లో సుధీర్ఘ చికిత్స పొందిన ప్రముఖ దర్శకుడు..దర్శకరత్న దాసరినారాయణరావు మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందన్నారు. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని చిరంజీవి దాసరికి అందజేశారు. అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లైఫ్ లో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. తాను తీసిన ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య నటించారని ఆయనకు ప్రత్యామ్నాయంలేదని దాసరి చెప్పారు. కాగా, చిరంజీవి, మోహన్‌బాబు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులంతా దాసరి ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఉదయం నుంచీ జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసం రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానుల రాకతో సందడిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com