బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి వార్షిక టర్నోవర్ 10 వేల కోట్లు
- May 05, 2017
పతంజలి సంస్థ రెండేళ్లలో దేశంలోని అతిపెద్ద స్వదీశీ బ్రాండ్గా అవతరిస్తుందని యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. పతంజలి వార్షిక టర్నోవర్ 10 వేల 561 కోట్లకు చేరిన సందర్భంగా తమ భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. ప్రస్తుతం 6 వేల మంది ఉన్న తమ డీలర్ల సంఖ్యను 12 వేలకు పెంచబోతున్నట్టు చెప్పారు. 1857లో దేశంలో మొదటి స్వాతంత్ర పోరాటం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిందని. కానీ విదేశీ సంస్థలు దేశంలో ఇప్పటికీ 50 లక్షల కోట్ల ఎకానమీని ఆక్రమించాయని అన్నారు. లాభాలను దేశం కోసం ఉపయోగించకుండా.. మన డబ్బును విదేశాలకు తరలిస్తున్నాయన్నారు. పతంజలి సామర్థ్యాన్ని 60వేల కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరిస్తామని బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ తెలిపారు. విజయనగరంలో సుగంధ ద్రవ్య యూనిట్ ఏర్పాటు చేస్తామని, దక్షిణాది రాష్ట్రాలకు అనువైన ఆహారోత్పత్తులు కూడా అక్కడే తయారు చేస్తామని తెలిపారు. పతంజలి చారిటీ ద్వారా తమ సంస్థ వంద శాతం లాభాలను విద్య, పరిశోధన, గోవుల సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. అమర జవాన్ల పిల్లల కోసం ఢిల్లీలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అన్ని ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. 5 ఔషధ ఉత్పత్తుల మినహా దేనిలోనూ గోమూత్రం ఉపయోగించడంలేదన్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









