అమెరికాలో మహిళకు 737 కోట్ల పరిహారం
- May 05, 2017
-జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కోర్టులో చుక్కెదురు
సెయింట్ లూయీ: తనకు క్యాన్సర్ సోకడానికి జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడరే కారణమంటూ వ్యాజ్యం దాఖలు చేసిన మహిళకు అమెరికాలోని మిస్సోరీ రాష్ర్టానికి చెందిన సెయింట్ లూయీ కోర్టు భారీస్థాయిలో 11 కోట్ల డాలర్ల నష్టపరిహారం ఇప్పించింది. భారత కరెన్సీలో అది రూ.737 కోట్లు. దీర్ఘకాలం ఆ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ను వాడటం వల్లే తనకు అండాశయాల క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ లోయీ స్లెంప్ అనే మహిళ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆమెకు అంత భారీమొత్తంలో పరిహారం ఇప్పించడం సంచలనం సృష్టిస్తున్నది. జాన్సన్ బేబీ పౌడరుతోసహా కంపెనీ తయారు చేసే పలు టాల్కం ఉత్పత్తులపై సుమారు 2400 కేసులు నడుస్తున్నాయి. శాస్త్రపరమైన ఆధారాలను ఖాతరు చేయకుండా ఈ కంపెనీలు అమెరికా మహిళల పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తూనే ఉన్నాయని ఈ కేసు రుజువుచేస్తున్నదని స్లెంప్ తరఫు న్యాయవాది టెడ్ మీడోస్ వ్యాఖ్యా నించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









