'సాహో' కోసం విలన్ల గాలింపు

- May 06, 2017 , by Maagulf
'సాహో' కోసం విలన్ల గాలింపు

బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి వరకూ కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ కి ఇప్పుడు తమిళ్..మళయాళంతో పాటూ హిందీలోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే ప్రభాస్ న్యూ మూవీ ' సాహో ' ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

ఇక ఈ మూవీలో ప్రభాస్‌కి సరైన విలన్ కోసం చూసిన టీం చివరికి అరవింద్ స్వామిని ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ' ధృవ ' తో స్టైలిష్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అరవింద్. దాంతో అరవింద్ ని కాల్షీట్స్ కోసం వెళ్ళిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి కోటి పైన రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చుక్కలు చూపించాడు. అయితే అరవింద్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ' సాహో ' ప్రొడ్యూసర్స్ రెడీ అయ్యారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com