హందాన్ అవార్డు గెలుచుకున్న తెలుగు రత్నం

- May 07, 2017 , by Maagulf

దుబాయ్:జెమ్స్ అవర్ ఇండియన్ స్కూల్, దుబాయ్ లో  12వ తరగతి చదువుతున్న మన తెలుగు అమ్మాయి శ్రీ దివ్య, హందాన్ అవార్డు ఫర్ డిస్టింగులిషేడ్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ యూఏఈ నేషనల్ అవార్డు గెలుచుకుంది. గ్రేడ్  3 నుంచి 12 వరకు కేవలం 20 భారతీయ పిల్లలకి ఈ అవార్డు ప్రభుత్వం ఇచ్చింది. ఇటీ వలే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో H.H.SHEIKH HAMDAN,దుబాయ్ డిప్యూటీ రులెర్ ,ఫైనాన్స్ మినిస్టర్ ట్రోఫీ, సర్టిఫికెట్,నగదు బహుమతి అందించారు. చదువు తో పాటు అనేక రంగాలలో నైపుణ్యము, ప్రతిభను చాటుతూ,ఎంతో మంది పిల్లలని సామజిక సేవ పరియావరణ రక్షణ కై ప్రోత్సహించినందుకు ప్రభుత్వం హందాన్ అవార్డు ప్రదానం చేసింది. ఈ సందర్భముగా శ్రీ దివ్య మాట్లాడుతూ కఠిన పరిశ్రమ , దీక్ష,నిజాయితీ నా విజయానికి కారణాలు. తన తల్లి తండ్రులు మరియు టీచర్స్ ప్రోత్సాహం,మార్గదర్శనం ,మద్దతు వాళ్ళ గెలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భముగా శ్రీ దివ్య తల్లి తండ్రులు శ్రీమతి పద్మజ, శ్రీ కిషోర్ మాట్లాడుతూ మా అమ్మాయికి యూఏఈ ప్రభుత్వం అవార్డు ఇవ్వటం చాలా సంతోషం అని తెలిపారు.
కేవలం చదువుకే పరిమితం కాకుండా,ఆటల పాటలలో రాణిస్తూ, సమాజం పట్ల ఒక బాధ్యతతో సేవ చేస్తున్న తమ కూతురుని ప్రశంసించారు. మరింత మంది పిల్లలు ఇటు వంటి బాట లో నడవాలని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com