ట్రంప్ పర్యటన సందర్భంగా రియాద్ లో 3 సమావేశాల నిర్వహణ

- May 09, 2017 , by Maagulf
ట్రంప్ పర్యటన సందర్భంగా రియాద్ లో 3  సమావేశాల నిర్వహణ

అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క చారిత్రాత్మక పర్యటనలో రాజ్యంలో మూడు ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయని బాగా ప్రాచుర్యం పొందిన మూలాల ప్రకారం ఈ సమాచారం తెల్సింది. .గత సోమవారం, మంగళవారం సన్నాహక సమావేశాలు జరిగాయి. ఇందులో సౌదీ మరియు అమెరికా సంయుక్త అధికారులు ఈ పర్యటనకు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. రెండు పవిత్ర మసీదుల యొక్క కస్టోడియన్ కింగ్ సల్మాన్  ట్రంప్ కు  రియాద్ లో ఆతిథ్యమివ్వనుంది, అనంతరం   రెండు దేశాల మధ్య  చారిత్రాత్మక వ్యూహాత్మక చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తాయి.రెండవ సమ్మేళనం అమెరికా  మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ ) దేశాల మధ్య ఉంటుంది మరియు ఇది గల్ఫ్ నాయకుల సగం వార్షిక సంప్రదింపుల ఈ సమావేశంతో జరగనుంది.. మూడవ సమ్మేళనం ట్రంప్ మరియు రాష్ట్రాల అధిపతులు మరియు అరబ్ మరియు ఇస్లామిక్ రాష్ట్రాల నాయకులకు మధ్య ఉంటుంది, ఇవి తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి ఇస్లామిక్ కూటమిలో భాగంగా ఉండనున్నాయి.సదస్సులో పాల్గొనడానికి రియాద్ ముస్లిం నాయకులకు ఆహ్వానాలను పంపడం ప్రారంభించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతః ఎల్-సిసీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్లు ఉన్నారు. దౌత్యపరమైన సమాచారం ప్రకారం, ట్రంప్ సదస్సులో  అమెరికా ఇస్లాం మతంకి వ్యతిరేకంగా కాదని వారి గొప్ప మతాన్ని వారి స్వార్థ ప్రయోజనాలకు దోహదపరుస్తున్నవారికి వ్యతిరేకంగానే వ్యవహరించనుందని తెలియచేయనుంది. , తీవ్రవాదం మరియు తీవ్రవాద చర్యలను  ఎదుర్కోవడంలో తమతో చేతులు కలిపేందుకు అవసరమైన అంశాలు ఈ మూడు రోజుల సమావేశంలో కీలకం కానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com