అమెరికాలో మరో దారుణం: 'సిగరేట్' కోసం భారతీయుడి హత్య
- May 09, 2017
అమెరికాలో జరుగుతున్న వరుస భారతీయుల హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారతీయుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...పంజాబ్లోని కపుర్తలాకు చెందిన జగ్ జీత్ సింగ్ (32) 18 నెలల క్రితం అమెరికా వచ్చారు.
ఆయన హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఆయనను ఒక వ్యక్తి వచ్చి సిగిరెట్లు కావాలని అడగడంతో.. మైనర్ ఏమో అని అనుమానం వచ్చిన జగ్ జీత్ సింగ్ ఐడీ చూపించాలని కోరాడు. కాగా, విధులు పూర్తి చేసి, బయటకు వచ్చిన జగ్ జీత్ సింగ్ను ఆ వ్యక్తి జాత్యహంకారంతో దూషిస్తూ, కత్తితో పొడిచేశాడు.
గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 9 గంటలపాటు చికిత్స పొందిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, వారం వ్యవధిలోనే వరుసగా భారతీయులు హత్యకు గురికావడం పట్ల ఆందోళన నెలకొంటోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







