మస్కట్లో ఇద్దరు మహిళల విక్రయం!
- May 09, 2017
ఉపాధి చూపుతామని ఆశ చూపి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లిన ఇద్దరు మహిళలను ఓ ముఠా అక్కడి సేట్లకు విక్రయించారని కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో మంగళవారం కలకలం రేగింది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్కు చెందిన ఓ ముఠా సభ్యులు తొమ్మిది నెలల క్రితం ఐదుగురు మహిళలకు మస్కట్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. మైలవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ద్వారా ఆ సభ్యులు మహిళల నుంచి డబ్బులు గుంచి ఇద్దరిని తొలివిడతగా మస్కట్ పంపించారు.
అక్కడ వారు కష్టాలు భరించలేక తిరిగి గ్రామానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు మహిళలను తీసుకెళ్లేందుకు కొండపల్లి వస్తున్నట్లు హైదరాబాద్ నుంచి ముఠా సభ్యులు మంగళవారం స్థానిక మహిళకు సమాచారం ఇచ్చారు. ముందుగా మస్కట్ వెళ్లిన మహిళలను అక్కడి సేట్కు విక్రయించారని, దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న స్థానికులు ముఠా వివరాలను పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్న పదిమంది సభ్యుల్లో ఇద్దరిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అనంతరం వారిని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు తరలిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







