అల్ ఇంజాజ్ ప్రైవేట్ స్కూల్ 12 గ్రేడ్ విద్యార్థులకు వీడ్కోలు
- May 10, 2017
అల్ ఇంజాజ్ ప్రైవేట్ స్కూల్ ఇటీవల క్రౌనే ప్లాజా మస్కాట్ లో ఒక గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది, ఆ పాఠశాల యొక్క మూడవ బ్యాచ్ 12 తరగతి విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణమయ్యారు. శ్రీశ్రీ సయ్యిద్ లోయ్ గాలిబ్ ఖాలిద్ ఆల్ సయిద్, ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.పాఠశాల డైరెక్టర్ అమిటా శర్మ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగాఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు వారి స్వంత సామర్థ్యాలపై నమ్మకం పెంపొందించుకోవాలని వారికి ఆయన సలహా ఇచ్చారు . ఆ ఉద్వేగభరితమైన కృషికి ఎల్లప్పుడూ బహుమానాలు దక్కుతాయని అయన అన్నారు.12 వ తరగతి విద్యార్ధులు పాఠశాలకు, వారి ఉపాధ్యాయులకు తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ ఒక పాటను సమర్పించారు. అదేవిధంగా గ్రేడ్ 12 విద్యార్థులకు అరబిక్ మరియు ఆంగ్లంలో అభినందనలు మరియు వీడ్కోలు తెలియచేస్తూ11 వ తరగతి విద్యార్థులు చక్కని పాటలు పాడారు. సాయంత్రం ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైన అంశంలో ముఖ్య అతిధి నుండి పలువురు విద్యార్థులు ట్రోఫీలను అందుకున్నప్పుడు వారి మొహాలు వెలిగిపోయాయి. విద్యార్థులకు తాము చదువుకొన్న జ్ఞాపకం పదిలపర్చుకొనేలా ఫోటోగ్రాఫిక్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నా విద్యార్థుల యొక్క ప్రతి తల్లితండ్రుల ముఖం మీద చిరునవ్వు ఆనంద బాష్పాలు ఈ అద్భుతమైన కార్యక్రమంలో చూడటం జరిగింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







